2020లో 27 శాతం వృద్ధి
ముంబై, జూన్ 21: కరోనా సంక్షోభంలోనూ ఇండియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వెల్లువెత్తాయి. కొవిడ్ మొదటివేవ్ ముంచెత్తిన 2020 సంవత్సరంలో 64 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐల్ని భారత్ ఆకర్షించిందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తెలిపింది. భారీస్థాయిలో ఎఫ్డీఐలు పొందిన దేశాల్లో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. నివేదికను యూఎన్ కాన్ఫెరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) సోమవారం విడుదల చేసింది. 2019లో ఇండియాకు వచ్చిన ఎఫ్డీఐలు 51 బిలియన్ డాలర్లుకాగా, అవి 2020లో 27 శాతం వృద్ధితో 64 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది.