న్యూఢిల్లీ, ఏప్రిల్ 30:యెస్ బ్యాంక్ లాభాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తాకింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,788 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి అధికంగా నిధులు వెచ్చించడంతో లాభాల్లో గండిపడిందని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ బ్యాంక్ రూ.3,668 కోట్ల నష్టం సంభవించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.5,818.59 కోట్ల నుంచి రూ.4,805.30 కోట్లకు పడిపోయినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఎన్పీఏలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో రూ.5,239.59 కోట్ల నిధులను వెచ్చించింది.