న్యూఢిల్లీ, ఆగస్టు 10: మహీంద్రా అండ్ మహీంద్రా..ఫ్లూయిడ్ పైపు సస్పిషియన్ సమస్య తలెత్తడంతో 29,878 పికప్ వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఫ్లూయిడ్ పైపు సస్పిషియన్ కొత్తది ఉచితంగా బిగించి కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యలో తయారైన పికప్ వాహనాల్లో ఈ సమస్యలు గుర్తించినట్లు తెలిపింది.