హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ శాంతిదూత దలైలామాకు ప్రతిష్ఠాత్మక ‘పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు’ను అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణీందర్జీత్సింగ్ బిట్టా, పీవీ మనమడు పీవీఆర్ కశ్యప్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, పీవీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్మారక అవార్డును అందుకుంటున్న సందర్భంగా దలైలామా తన హర్షాన్ని వ్యక్తం చేశారని, శాంతి ద్వారానే ప్రపంచం మనుగడ సాగించగలదని ఉద్ఘాటించారని నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమానికి, రతన్ టాటాకు ఇవ్వగా, మూడోసారి దలైలామాకు ఇచ్చామని పీవీఆర్ కశ్యప్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు.