హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ జోస్యం చెప్పారు. ఏపీలోని విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో మాత్రం బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఎన్నికల తర్వాత అటు వైసీపీని, ఇటు టీడీపీని చీల్చి బీజేపీ అధికారం చేపడుతుందని తెలిపారు. బీజేపీ గెలిస్తే ద్వారపాలకులుగా జగన్, చంద్రబాబు ఉంటారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ప్రధాని మోదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు తాను లేఖ రాసినట్టు తెలిపారు.