Airways | న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్జెట్ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటున్నది. మార్చి 31 నుంచి అక్టోబర్ 26 వరకు ఈ ఏడాదికిగాను సమ్మర్ షెడ్డ్యూల్ను ప్రకటించాయి సంస్థలు. ఈ సమ్మర్ సీజన్లో దేశీయ విమానయాన సంస్థలు అమెరికాతోపాటు బ్రిటన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, జార్ఝియాతోపాటు 37 దేశాలకు విమాన సర్వీసులు నడుపుతున్నాయి.