న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్లో ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ అయిన న్యూ జనరేషన్ కేటీఎం ఆర్సీ సిరీస్ భారత్లోనూ అడుగుపెట్టింది. న్యూ ఆర్సీ 125 బైక్ భారత్లో రూ 1.82 లక్షలు, ఆర్సీ 200 బైక్ రూ 2.09 లక్షలకు (ఎక్స్షోరూం) అందుబాటులో ఉంటుందని కేటీఎం వెల్లడించింది.
ఇక ఫ్లాగ్షిప్ కేటీఎం ఆర్సీ 390 ఇండియా లాంఛ్కు మరికొద్ది నెలల సమయం పట్టనుంది. న్యూ ఆర్సీ 125, ఆర్సీ 200 మునుపటి మోడల్స్ ధరలకే లభిస్తుండటం కస్టమర్లకు ఊరట ఇస్తోంది. కేటీఎం ఆర్సీ 125, ఆర్సీ 200కు ఆస్ట్రేలియన్ కంపెనీ భారత్లో అధికారికంగా బుకింగ్స్ను ఆరంభించింది. ఆర్సీ 200 బైక్ త్వరలో డీలర్లకు చేరుతుందని, న్యూ ఆర్సీ 125 బైక్ వచ్చే నెల డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని బజాజ్ ఆటో ప్రొ బైకింగ్ బిజినెస్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ తెలిపారు. భారత మార్కెట్లో కేటీఎం అడుగుపెట్టి ఈ ఏడాది పదేండ్లు అవుతున్న క్రమంలో న్యూ ఆర్సీ సిరీస్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.