న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థికాభివృద్ధి మళ్లీ వేగవంతమవుతున్నదని, పారిశ్రామికులు రిస్క్ తీసుకొని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోది కోరారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడుతూ దేశ ప్రయోజనాల రీత్యా ప్రభుత్వం అన్ని రిస్క్లను తీసుకుంటున్నదని, ఇటీవలి సంస్కరణలే అందుకు ఉదాహరణ అని అన్నారు. రాజకీయ రిస్క్ కారణంగా గత ప్రభుత్వాలు జీఎస్టీని అమలు చేయలేదని, తాము అమలుచేసి రికార్డు వసూళ్లు రాబడుతున్నామని మోది వివరించారు. ఆయన ఇంకా ఎమన్నారంటే..