భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాతా మధుసూదన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
రాష్ట్రంలోని అధిక శాతం ప్రజలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు అందుతూనే ఉన్నాయని అన్నారు.