ములకలపల్లి : మానవాళి మనుగడ మొక్కతోనే సాధ్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అటవీశాఖ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ స్కైలాబ్ అన్నారు. మండల కేంద్రమైన ములకలపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆయన విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడం వల్లే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ శ్రావణి, సిబ్బంది లక్ష్మణ్, వెంకటరమణ, డీపీఎం తాజుద్దీన్, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.