తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, పాలకమండలి సభ్యులను ఇంకా నియమించలేదు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటివరకు ఉన్న టీటీడీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. అదేఏడాది (2019) జూలై 22న వైవీ సుబ్బారెడ్డిని కొత్త చైర్మన్గా నియమించింది. అయితే పాలక మండలి పదవీకాలం ఈఏడాది జూలైలో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మరోమారు ఆయననే చైర్మన్గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. దీంతో మరో రెండేండ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు.