Attack on TDP Leader | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో మరోమారు రాజకీయ పూరిత కక్షలు పడగ విప్పాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ కంటికి గాయమైంది. దీంతో ఆయన్ను చికిత్స కోసం తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్కు తరలించారు. దేవినేని అవినాష్ అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ ఆరోపించింది.
విజయవాడ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య కార్పొరేటర్గా గెలవడం గమనార్హం. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మద్యం మత్తులో గొడవ పడ్డట్లు సమాచారం. మొత్తం ఐదుగురు దాడి చేశారని టీడీపీ నేతలు చెప్పారు.
మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న గాంధీ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.