అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు(YS Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash reddy ) ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ జూలై 3కు వాయిదా పడింది. మే 31న తెలంగాణ హైకోర్టు అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్(Bail) ఇవ్వగా వైఎస్ వివేకా కూతురు సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణకు అంగీకరించడంతో కోర్టులో ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా సోమవారం మరోసారి కేసు విచారణకు వచ్చింది. సునీత వేసిన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని అవినాష్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. జులై 3న ధర్మాసనం ముందు జరుగనున్న విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు నోటీసులో పేర్కొంది.