YS Jagan | మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్రావు తండ్రి సత్యనారాయణరావు మృతి పట్ల ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విచారం వ్యక్తం చేశారు. హరీశ్రావు తండ్రి మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిన ప్రార్థించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్తో ఆయన ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు.
కాగా, తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణరావు (కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మి భర్త) తో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. సత్యనారాయణరావు మృతిపట్ల విచారం వ్యక్తంచేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకుముందు సత్యనారయణ రావు మృతి విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్లో హరీశ్ రావును పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.