అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన వైఎస్ జగన్ నేడు మడమతిప్పారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రైవేట్పరం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను గట్టిగా పోరాడి అడ్డుకున్నామని తెలిపారు. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం లాలూచి పడి, దొంగతనంగా వారికి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై అభిమానం లేదు. డబ్బులు దోచుకొని దాచుకోవడం తప్పా .. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. అన్నింటా విఫలమై సమాదానం చెప్పలేని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలిస్తాడని విమర్శించారు.