అమరావతి: తహశీల్దార్పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు. మద్యం సేవించి దాసరిపల్లి సర్పంచ్ భవనం కృష్ణారెడ్డి తనపై దాడి చేసి బెదిరించినట్లు తహశీల్దార్ నాగార్జునరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భవనం కృష్ణారెడ్డిపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.