అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. మొత్తం 20 రౌండ్లకుగాను ఇప్పటిరకు 19 రౌండ్లు ముగిశాయి. మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్పై 80,161 ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో మరికాసేపట్లో పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఇప్పటికే బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.