అమరావతి : గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు మంత్రి కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నా సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. క్యాసినో వ్యవహారంలో దాదాపు 5వందల కోట్లు చేతులు మారినా కూడా సీఎం స్పందించడం లేదని, గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకొచ్చిన మంత్రిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
క్యాసినో నిర్వహించినట్లు ఆధారాలతో సహ మీడియా ప్రసారం చేసిన విషయాన్నిరాష్ట్ర ప్రజలందరూ గమనించారని తెలిపారు. ఇప్పటికైనా క్యాసినో, బూతుల మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.