తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న భక్తులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ల లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 58,176 మంది భక్తులు దర్శించుకోగా 20,157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.22 కోట్లు వచ్చిందన్నారు.
అత్యంత వైభవంగా కార్తిక మహాదీపోత్సవం
కర్నూలులోని ఏపీఎస్పీ మైదానంలో రాత్రి కార్తిక మహాదీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శక్తి పీఠాధిపతి రమ్యానంద భారతి మాతాజీ మాట్లాడుతూ కార్తిక మాసంలో భాగవదారాధన ఎంతో విశిష్టమైనదని, దీపారాధన ద్వారా భగవంతుని కొలిస్తే ఎంతో పుణ్యఫలమని చెప్పారు. సకల దేవతా స్వరూపమైన గురువు పూజిస్తే, దేవతలందరినీ పూజించిన ఫలితం దక్కుతుందన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు పవిత్రమైన కార్తిక మాసంలో దీపోత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.