తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవుదినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు. స్వామివారి దర్శానానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో స్వామివారి సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 82,580 మంది భక్తులు దర్శించుకోగా 31,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి ( Hundi ) రూ 4 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.