అమరావతి : అలిపిరి ఘటనను సాకుగా తీసుకొని నాడు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్ల పడ్డ చంద్రబాబు ఏడుపు రాజకీయాలతో లబ్ధిపొందాలని చూస్తున్నారని, నాటి ఓటమి పరిస్థితులే నేడు కూడ పునరావృతం అవుతాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యనించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరపరాజయం, సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటమిని జీర్ణించుకోలేక, కుటుంబ సభ్యులపై అవమానం జరిగిందని ఏడుపుగొట్టు రాజకీయలకు మరోసారి తెరలేపారని విమర్శించారు.
ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తనకంటే చంద్రబాబు మహానటుడని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని పేర్కొన్నారు. రాజకీయంలో కొడుకు లోకేశ్ అప్రయోజకుడు కావడం కూడా చంద్రబాబు ఆవేదనకు ఒక కారణమని అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామన్నా కల కూడా సుదూరంలోనూ కనిపించకపోతుండడంతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో, అర్థం కావడం లేదని అన్నారు.