అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 24,659 మందికి పరీక్షలు నిర్వహించగా 174 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. 301 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రసుత్తం ఏపీలో 2265 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
అత్యధికంగా చిత్తూరులో 29 మంది, ఈస్ట్ గోదావరిలో 13, గుంటూరులో 26, కృష్ణాలో 32, వెస్ట్ గోదావరిలో 31 మంది, విశాఖపట్నంలో 10 మంది , నెల్లూరులో 12 మంది కొవిడ్ బారిన పడ్డారని అధికారులు వివరించారు.