అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలకు తూట్లు పొడిచి జీవో నం. 2ను తీసుకొచ్చి
సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సర్పంచులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
సర్పంచుల వ్యవస్థను తొలగించేందుకు వాలంటీర్లను అందలం ఎక్కించిందని, సర్పంచులకు అధికారం లేకుండా చేసిందని విమర్శించారు . హక్కుల కోసం సర్పంచులు చేసే పోరాటానికి మద్దతు ఉంటుందని వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేశామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులను చట్టవిరుద్ధంగా దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఏపీలో ఉగ్రవాదులను మించిన పాలన వైసీపీ చేస్తుందని అన్నారు.