అమరావతి : ఏపీ మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. నిన్నటి రోజు (బుధవారం )శ్రీకాకుళం జిల్లా పలాసలో గృహ నిర్మాణశాఖపై సమీక్షేందుకు వస్తున్న మంత్రి రాకకు ముందు మున్సిపల్ సమావేశం నుంచి వీఆర్వోలను బయటకు పంపించారు. దీంతో వీఆర్వోలు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
సమీక్షకు వచ్చిన మంత్రి అప్పలరాజును వీఆర్వోలు అడ్డుకోవడంతో మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్వోలను సస్పెండ్ చేయాలని, నియోజకవర్గంలో వీఆర్వోల సేవలు అవసరం లేదని వ్యాఖ్యనించడంతో వీఆర్వోలు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళబాట పట్టారు. మంత్రి అప్పల రాజు, పురపాలక కమిషనర్ రాజగోపాల్ వీఆర్వోలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.