హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓటుకు నోటు పట్టుబడ్డ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును జూలై 24కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు (Supreme Court) వెల్లడించింది . 2015లో ఓటుకు నోటు కేసులో టీడీపీ నాయకుడు చంద్రబాబు(Chandra Babu), రేవంత్ రెడ్డి(Revanth reddy) (ప్రస్తుత ముఖ్యమంత్రి) ని ఏసీబీ (ACB) అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
కేసు విచారణలో జాప్యం జరుగుతుండడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మేరకు గురువారం మరోసారి విచారణకు వచ్చింది . కోర్టు వేసవి సెలవుల అనంతరం విచారణ చేపట్టాలని చంద్రబాబు, రేవంత్రెడ్డి తరుఫున న్యాయవాదులు కోర్టును కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.
అయితే వాయిదాలు మరోసారి ఇవ్వబోమని , ఇదే చివరి అవకాశమంటూ కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. కేసులో అన్ని సాక్ష్యాలున్నా కూడా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.