అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో ఎంపికవ్వడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సమయపాలన, క్రమశిక్షణ, ఖచ్చితత్వం, వ్యక్తిత్వం, అభిరుచులలో నైపుణ్యాన్ని బట్టి ఆమె ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం ఆమె ఢిల్లీ ఎన్సీసీ డైరెక్టరేట్లో తుది శిక్షణ పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఇద్దరు బాలికల్లో ఆమె ఒకరు. అన్నానేహా థామస్ ఎంపికవ్వడం పట్ల సీతామ్ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ లు సంతోషం వ్యక్తం చేశారు.