అమరావతి : విశాఖ రైల్వే స్టేషన్ (Visaka Rly Station) లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్లోని 3,4ప్లాట్ఫార్మ్స్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (Foot Over Bridge) పాక్షికంగా కుంగింది. ఈ సమయంలో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎలాంటి నష్టం జరుగలేదు. అయితే బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ తీగలు (Electrical Wires) తెగిపోవడంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అదే సమయంలో ప్లాట్ఫాంపైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలును వెంటనే నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టి రైలు వెళ్లడానికి అనుమతించారు. విషయం తెలుసుకున్న వాల్తేరు రైల్వే డీఆర్ఎం (DRM) సౌరబ్ ప్రసాద్ బ్రిడ్జ్ను పరిశీలించారు. రేపటికల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.