తిరుమల : వేసవి సెలవులు, ఎన్నికలు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వల్ల వారు దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సామాన్య భక్తులకు (Common devotees) త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ ౩౦వ తేదీ వరకు శుక్ర శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం(Break Darsan) రద్దు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు.