Vijayawada | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ అమ్మాయిని మృత్యువు కబళించింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకవ్వడంతో దుర్మరణం చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గ్రామీణం ప్రసాదదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) విజయవాడలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లింది. షికాగోలోకి ఓ కాలేజీలో చేరింది. కాగా, బుధవారం అమె కారులో వెళ్తుండగా అందులోనుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్తో పాటు జహీరా స్పృహ తప్పింది. ఇది గమనించిన పలువురు వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జహీరా మరణవార్తను ఆమె స్నేహితులు.. విజయవాడలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా.. జహీరా మృతికి సంబంధించి పూర్తి వైద్య నివేదిక రావాల్సి ఉంది.