హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నదని ఏసీబీ జడ్జి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్పై ప్రభావం పడుతుందని, కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ, కేసును 19కి వాయిదా వేశారు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కలిసేందుకు జైలు అధికారులు అనుమతినివ్వలేదు. రిమాండ్లో ఉన్న ముద్దాయికి ఒక వారంలో రెండు ములాఖత్లు మాత్రమే ఉంటాయని జైళ్ల ఉపశాఖాధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడో ములాఖత్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. భువనేశ్వరి అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించకపోవటం వల్ల మూడో ములాఖత్ తిరస్కరించామని వివరించారు.