అమరావతి : విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేయర్గా విశాఖ నగరాభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీగా హరి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సబ్బం హరి తనకు మంచి మిత్రుడని, తననెంతో అభిమానించేవాడని అన్నారు.
సబ్బం హరి ఆకస్మిక మరణం విచారకరమని విశాఖ ఎంపీ. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. హరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.