కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ( Vetlapalem ) లో బాణసంచా ( fireworks ) తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ( Explosion ) లో గురువారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్కు చెందిన వెంకటలక్ష్మి(69) మృతి చెందింది. ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమం కాగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అప్పటి నుంచి రోజుకొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మంగళవారం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోవరాజు, బుధవారం వీర శ్రీను (39) , మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన నలుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి.