తిరుమల: తిరుమలలోని అప్ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలు 40 రోజుల తర్వాత మొదలయ్యాయి. టిటిడి అడిషనల్ ఈ ఓ ఎవి ధర్మారెడ్డి మంగళవారం రెండో ఘాట్ రోడ్డు (అప్ ఘాట్)ను వాహనాల రాకపోకలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40రోజుల తర్వాత అప్ ఘాట్ రోడ్ పునరుద్ధరణ పనులను పూర్తి చేసామని, భక్తులకుఈ రోడ్డు పై నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.