అమరావతి : ఏలూరులో పోలీసులు భారీగా బంగారాన్ని(Gold) , వెండి(Silver) ఆభరణాలను స్వాధీనం( Seize ) చేసుకున్నారు. వీటితో పాటు మరో 15 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టుల (Checkposts) ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోకి నలుమూలల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యేక స్క్వాడ్ బృందాలు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నాయి.
దీంట్లో భాగంగా సోమవారం ఉదయం ఏలూరు (Eluru) జిల్లా కలపర్ను టోల్గేట్ వద్ద కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 50 కిలోల బంగారం, వెండి, మరో కారులో 22 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్వద్ద కారులో రూ. 15 లక్షలను గుర్తించి వాటిని పట్టుకున్నారు. వీరి వద్ద సరైనా గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పెదపాడు పోలీసులు వాటిని సీజ్ చేశారు. బంగారాన్ని విజయవాడ నుంచి బీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నామని అధికారులు వివరించారు.