Vande Bharat Train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతింది. దీంతో ఘటనాస్థలిలోనే రైలును నిలిపివేశారు. ఆ తర్వాత సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాతనే రైలు బయలుదేరి వెళ్తుందని అధికారులు తెలిపారు. షెడ్యూల్ సమయం ప్రకారం రైలు.. రాత్రి 11.30గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ఘటన నేపథ్యంలో ఆలస్యమవుతుందని అధికారులు వివరించారు.