అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ పి.ఆర్.సి ఫిట్మెంట్ 27శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు ప్రకటన వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేయాలని పి.ఆర్.సి కాలపరిమితిని ఐదు సంవత్సరాలు గానే ఉంచాలని,హెచ్ ఆర్ ఏ పాత స్లాబ్ లలో కొనసాగించాలని, సచివాలయ ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా 3, 4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వం మొండి పట్టుదలను వీడి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.శివప్రసాదరావు , గంగాధర్,ఖాదర్ బాషా, సాధిక్, మాలియకార్జున, ఖాజా రంతుల్లా, ఖాజారసూల్, సుధాకర్ లక్కుప్రసాద్, మనిప్రసాద్,ఆత్మకూరు, ఏ.ఎస్. పేట, అనంతసాగరం, మర్రిపాడు మండలాల యుటిఎఫ్ నాయకులు కార్యకర్తలు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.