అమరావతి : కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దంపతులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి ఆదివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ఈవో ఏవి ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు పియూష్ గోయల్ దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను, శ్రీవారి ఫొటో లామినేషన్ను అందజేశారు.
నిన్న స్వామివారిని 90,165 మంది భక్తులు దర్శించుకోగా 43,362 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.18 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని వీరికి నాలుగు గంటల్లో దర్శనం లభిస్తుందని వెల్లడించారు.