తిరుమల : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలను, టీటీడీకి చెందిన క్యాలెండర్లను అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జమ్ములో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ నిర్మించడం సంతోషకరమని అన్నారు . పంచగవ్వ ఉత్పత్తులు, గో రక్షణ చర్యలతో గోమాతపై గౌరవం పెరిగిందన్నారు.