అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరగనున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్న సమస్యలు అలాగే రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే కేంద్ర హోంశాఖ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయా అంశాలపై స్పష్టత వస్తుందని రెండు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.