అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మండపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు బయలు దేరారు. వీరు మారేడుమిల్లి మండలం వాలమూరు వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవాశాత్తు సందీప్, అరుణ్ అనే యువకులు వాగులో గల్లంతయ్యారు
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.