అమరావతి : అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో ని కొన్ని జిల్లాలో ఒకటైన కర్నూలులో ఇవాళ విషాదం చోటు చేసుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కుప్పగల్లో వర్షం కారణంగా ఇద్దరు మహిళలు చెట్టుకిందకు వెళ్లారు. ఇదే సమయంలో పిడుగు చెట్టుపై పడి ఇద్దరు మహిళలు ఉరుకుందమ్మ (33) , లక్ష్మమ్మ(39)లు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.