అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూరగాయల వ్యాపారులు (Vegetable traders) దుర్మరణం చెందారు. చిలకలూరి పేట కొత్త మార్కెట్ యార్డు వద్ద మార్కెట్ యార్డులో వ్యాపారం చేసే ఇద్దకు వ్యక్తులు కూరగాయల కొనుగోలు చేసేందుకు వేర్వేరుగా ద్విచక్రవాహనం వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఇద్దరిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నాదేండ్ల మండలం గణపవరానికి చెందిన కంబంపాటి కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ కిషోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.