అమరావతి : చిత్తూరు జిల్లా నారాయణవనం బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు తిరుపతి చెర్లోపల్లికి చెందిన బాబు, రాముగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.