అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు విద్యార్థులు (Students) దుర్మరణం చెందారు. నార్సల మండలం కేశేపల్లి వంతెన వద్ద ద్విచక్రవాహనంపై నలుగురు విద్యార్థులు వెళ్తుండగా ప్రమాదవశాత్తు వారు నడుపుతున్న వాహనం అటుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో ద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.