అమరావతి : ఏపీలోని నంద్యాల బైపాస్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్కు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా పదకొండు మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.