అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పాదచారులు మృతి చెందారు. కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన నుంచి వెళుతున్న పాదచారులను ఢీ కొనడంతో మునియ్య , చెంచమ్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో అతివేగంగా కారును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.