AP News | వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గీతాంజలిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ సోషల్మీడియా కార్యకర్త రాంబాబుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని తెనాలికి చెందిన గీతాంజలి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం వైరల్గా మారింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతిపక్ష టీడీపీ, జనసేన కార్యకర్తలు గీతాంజలిని ట్రోలింగ్ చేశారు. కొంతమంది అయితే హద్దులు దాటి అసభ్యకరంగా ఆమెను దూషించారు. బూతులు తిట్టారు. సోషల్మీడియా వేధింపులతో మానసిక క్షోభకు గురైన గీతాంజలి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం జగన్.. మృతురాలి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.