అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా రాజంపేట మండలం చెర్లోపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నరసమ్మ(60), లక్ష్మయ్య(40) మృతి చెందారు.
గాయపడ్డ మరో ముగ్గురిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.