అమరావతి : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లి వద్ద ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు బ్రహ్మణపల్లి వాసులేనని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పిడుగురాళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.