అమరావతి : ఏపీలోని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.